- District News
- తాండూరుకు హంగామా కాదు.. అభివృద్ధి కావాలి.
తాండూరుకు హంగామా కాదు.. అభివృద్ధి కావాలి.
బీఆర్ఎస్ ర్యాలీలో అసభ్య నినాదాలు బాధాకరం: - పైలట్ రోహిత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి
డీసీసీ అధికార ప్రతినిధి కె. గోపాల్
Published On
By Ram Reddy
లోకల్ గైడ్/తాండూరు:
ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి, ర్యాలీలో చోటుచేసుకున్న అనుచిత వ్యాఖ్యలను ఖండించడంతో పాటు తాండూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ విమర్శల పరిధిని దాటి వ్యక్తిగత విమర్శలకు దిగజారాయని గోపాల్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తాండూరులో జరిగిన అభివృద్ధి, అప్పట్లో వచ్చిన నిధులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన నిధులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
తాండూరు ప్రజలు హంగామా, బలప్రదర్శన రాజకీయాలను కాకుండా అభివృద్ధి, ఉపాధి, విద్య, తాగునీరు, రోడ్లు, సంక్షేమం వంటి ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుకుంటున్నారని గోపాల్ పేర్కొన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా తీర్పును ఇస్తారని అన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
19 Aug 2026 12:23:09
గండిపేట్, (లోకల్ గైడ్):
ఉన్నత విద్యను అభ్యసించేందుకు పేద విద్యార్థికి ఆర్థిక సహాయాన్ని అందించిన మణికొండ డివిజన్ మాజీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి అండగా నిలిచి
