వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి..

భక్తి, శ్రద్ధలతో పట్టణ మహా గణపతి పూజ లో పాల్గొన్న  మాజీ మంత్రి. 

Published On
వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి..

వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి సెప్టెంబర్ 14:

వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధ లతో శాంతియుత వాతావరణంలో  జరుపుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం  పట్టణంలో పాలిటెక్నికల్ కళాశాల ముఖద్వారం దగ్గర ప్రతిష్టించిన మహా గణపతిని ఆయన భక్తి శ్రద్ధ లతో పూజలు చేసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నాలు తొలిగించే విఘ్నేశ్వరుడు కలియుగంలో ప్రథమ పూజితుడిగాIMG-20260914-WA0153 ప్రసద్దికెక్కినారని అటువంటి గణపతి అశీస్సి లతో ప్రజలలో భక్తిశ్రద్ధలు, ఐకమత్యం విరసిల్లాలని బాలగంగాధర్ తిలక్  వినాయక చవితికి శ్రీకారం చుట్టారన్నారు. వినాయక చవితి బ్రహ్మోత్సవాలను  కనుల పండుగగా  జరుపుకోవాలన్నారు. భక్తిశ్రద్ధలతో నిమజ్జనం వేడుకలు నిర్వహించాలన్నారు. వినాయక    పట్టణ మహాగణపతి కమిటీ సభ్యులు మాజీ కౌన్సిలర్ చీర్ల చందర్ బృందం  మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ని  సాదరంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేసి సన్మానించారు.
పట్టణ మహాగణపతి కమిటీ సభ్యులు చీర్లచందర్ బృందం  ప్రతిష్టాత్మకంగా వినాయక చవితి పండుగ నిర్వహించి మన సంస్కృతి సాంప్రదాయాలకు ఆదర్శంగా నిలిచారని ఆయన అభినందించారు. అదే విధంగా గత సంవత్సరం వేలం పాటలో లడ్డు దక్కించుకున్న జగదాంబ జ్యువెలరీ అధినేత సముదాన్ దంపతులను  నిరంజన్ రెడ్డి  సన్మానించి అభినందించారు. వెంట వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, బీచుపల్లి యాదవ్, విష్ణు సాగర్, కౌన్సిలర్. శ్రీకర్ గౌడ్, మాజీ కౌన్సిలర్స్ ఉంగ్లం తిరుమల్, నాగన్న యాదవ్, చిట్యాల రాము, తోట. శ్రీను.మహా గణపతి కమిటీ సభ్యులు కృష్ణ బాబు, గట్టువెంకన్న, వెంకటేష్, కొమ్ముశ్రీనివాస్, వాకిటినారాయణ తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Latest News