- District News
- Warangal
- పబ్లిక్ గార్డెన్లో ఆరోగ్య అవగాహన సదస్సు
పబ్లిక్ గార్డెన్లో ఆరోగ్య అవగాహన సదస్సు
Published On
By Ram Reddy
హనుమకొండ జిల్లా 30(లోకల్ గైడ్ న్యూస్)*:
క్లెయిమ్ బోనస్ పరంగా కస్టమర్లకు ఇదొక వరం కాగా, వరుసగా ఐదేళ్ల పాటు ఎలాంటి క్లెయిమ్ చేయని కస్టమర్లకు, ఆరో సంవత్సరంలో ప్రీమియంపై ఏకంగా 30 శాతం రాయితీ లభిస్తుందని,చెల్లింపు సౌలభ్యంలో కస్టమర్ల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రీమియం భారం కాకుండా ఉండేందుకు ఈఎంఐ పద్ధతిలో చెల్లించే అద్భుతమైన సదుపాయం కూడా ఉందన్నారు.
*మనిషి కి నడక ఎంత ముఖ్యమో.. బీమా కూడా అంతే ముఖ్యం*
ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ గుడిపెల్లి రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజూ మన ఆరోగ్యకరమైన నడక ఎంత ముఖ్యమో, మన నిత్యజీవితంలో ఆకస్మిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు ఆరోగ్య భీమా కూడా అంతే ముఖ్యం అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుచూపుతో పాలసీని తీసుకోవాలని, తద్వారా కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సదస్సులో వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ గౌరు రాజిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఆకినెపల్లి రవిగుప్త, జనరల్ సెక్రటరీ అబ్దుల్ కరీం ట్రెజరర్ సుంకర రవి, సెక్రటరీ గుడిపెల్లి రాజిరెడ్డి, ఇ.సి. సభ్యులు రమణారెడ్డి , హరికృష్ణ, వీరితో పాటు ఈ ప్రతిష్టాత్మక అవగాహన సదస్సులో డాక్టర్ రమేష్, డాక్టర్ భగీరథ, వేణు, గోపి,స్రవంతి రెడ్డి , సత్యా మౌళిక, పెద్ద సంఖ్యలో వాకర్స్ పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
30 May 2026 22:00:13
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్ , మే 30 :
విత్తనాల విక్రయాలలో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని వైరా ఏడీఏ కరుణ
