శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్తో కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ ప్రారంభం
ఇంగ్లండ్ సిరీస్తో భారత్ బరిలోకి
దుబాయ్: దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్ వేదికగా రెండు రోజుల క్రితం ముగిసిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (2023–25) ఫైనల్తో మూడో ఎడిషన్కు ముగింపు కలిగింది. ఈసారి దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. ఇప్పుడు మూడు రోజుల గ్యాప్లోనే కొత్త సైకిల్ (2025–27) ప్రారంభం కానుంది. జూన్ 17న శ్రీలంక స్వదేశంలో బంగ్లాదేశ్తో గాలే వేదికగా ఆడే టెస్టుతో నాలుగో ఎడిషన్కు తెరలేవనుంది. మొత్తం 9 జట్లు పాల్గొని 71 టెస్టులు జరగనున్నాయి. ఈసారి ఆస్ట్రేలియా 22 టెస్టులు, ఇంగ్లండ్ 21 టెస్టులు ఆడతాయి. వరుసగా రెండు సార్లు రన్నరప్గా నిలిచిన భారత్ జట్టు కొత్త సారథి శుభ్మన్ గిల్ నేతృత్వంలో 18 టెస్టులు ఆడనుంది. భారత్ జూన్ 20 నుంచి ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్తో తమ టైటిల్ వేట ప్రారంభించనుంది. ప్రతి జట్టు మొత్తం ఆరు సిరీస్లు ఆడుతుంది — మూడు స్వదేశంలో, మూడు విదేశాల్లో.
భారత షెడ్యూల్:
గత సైకిల్తో పోలిస్తే ఒక టెస్టు తక్కువగా ఆడనున్న భారత్, స్వదేశంలో 9, విదేశాల్లో 9 టెస్టులు ఆడనుంది. స్వదేశంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో తలా రెండు మ్యాచ్లు, అలాగే వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఉంటుంది. విదేశాల్లో ఇంగ్లండ్తో ఐదు టెస్టులు, శ్రీలంక, న్యూజిలాండ్లతో తలా రెండు టెస్టులు ఆడనుంది.ఈసారి కూడా యాషెస్ సిరీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య సిరీస్లు ఫ్యాన్స్కి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. డబ్ల్యూటీసీ మూడో ఎడిషన్ విజేత దక్షిణాఫ్రికా ఈ అక్టోబర్లో పాకిస్తాన్తో టెస్టులతో తమ కొత్త సైకిల్ను మొదలుపెట్టనుంది. గతసారి 12 మ్యాచ్లు ఆడిన సఫారీలు ఈసారి 14 మ్యాచ్లు ఆడనున్నారు.