శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్‌తో కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ ప్రారంభం 

ఇంగ్లండ్ సిరీస్‌తో భారత్ బరిలోకి

శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్‌తో కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ ప్రారంభం 

దుబాయ్‌: దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్‌ వేదికగా రెండు రోజుల క్రితం ముగిసిన ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (2023–25) ఫైనల్‌తో మూడో ఎడిషన్‌కు ముగింపు కలిగింది. ఈసారి దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. ఇప్పుడు మూడు రోజుల గ్యాప్‌లోనే కొత్త సైకిల్‌ (2025–27) ప్రారంభం కానుంది. జూన్‌ 17న శ్రీలంక స్వదేశంలో బంగ్లాదేశ్‌తో గాలే వేదికగా ఆడే టెస్టుతో నాలుగో ఎడిషన్‌కు తెరలేవనుంది. మొత్తం 9 జట్లు పాల్గొని 71 టెస్టులు జరగనున్నాయి. ఈసారి ఆస్ట్రేలియా 22 టెస్టులు, ఇంగ్లండ్ 21 టెస్టులు ఆడతాయి. వరుసగా రెండు సార్లు రన్నరప్‌గా నిలిచిన భారత్‌ జట్టు కొత్త సారథి శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలో 18 టెస్టులు ఆడనుంది. భారత్‌ జూన్‌ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌తో తమ టైటిల్‌ వేట ప్రారంభించనుంది. ప్రతి జట్టు మొత్తం ఆరు సిరీస్‌లు ఆడుతుంది — మూడు స్వదేశంలో, మూడు విదేశాల్లో.

భారత షెడ్యూల్‌:
గత సైకిల్‌తో పోలిస్తే ఒక టెస్టు తక్కువగా ఆడనున్న భారత్‌, స్వదేశంలో 9, విదేశాల్లో 9 టెస్టులు ఆడనుంది. స్వదేశంలో వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాతో తలా రెండు మ్యాచ్‌లు, అలాగే వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ ఉంటుంది. విదేశాల్లో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు, శ్రీలంక, న్యూజిలాండ్‌లతో తలా రెండు టెస్టులు ఆడనుంది.ఈసారి కూడా యాషెస్‌ సిరీస్‌, బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ, దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లు ఫ్యాన్స్‌కి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. డబ్ల్యూటీసీ మూడో ఎడిషన్‌ విజేత దక్షిణాఫ్రికా ఈ అక్టోబర్‌లో పాకిస్తాన్‌తో టెస్టులతో తమ కొత్త సైకిల్‌ను మొదలుపెట్టనుంది. గతసారి 12 మ్యాచ్‌లు ఆడిన సఫారీలు ఈసారి 14 మ్యాచ్‌లు ఆడనున్నారు.

Tags:

About The Author

Latest News

బోనాలు ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక* బోనాలు ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక*
లోక‌ల్ గైడ్:తెలంగాణ కుమ్మర్ల  గోల్కొండ బోనాల ఉత్సవ సమితి అద్వైర్ర్యంలో జూన్ 26 నాడు గోల్కొండలో శ్రీశ్రీ శ్రీ జగథాంభిక అమ్మ వారికి బోనం దూప దీప...
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం
ఎస్‌సీవో డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయ‌ని రాజ్‌నాథ్ సింగ్‌
 పది మంది యాత్రికుల ఆచూకీ గల్లంతు
తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులు వర్షాలు – బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం
విశాఖలో కొత్త ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న కాగ్నిజెంట్
రైలు పట్టాలపై కారు నడిపిన యువతి – రంగారెడ్డిలో కలకలం