కొత్తపేట లో ఘనంగ ప్రపంచ ఆదివాసుల దినోత్సవం. మరం భీం విగ్రహానికి పూలమాలలు వేసిన ఆదివాసులు

ఆయన పోరాడి మనకు కల్పించిన  హక్కుల మనం కాపాడుకోవాలి *ఆదివాసులు

ఆకులు అలమలు  గడ్డలు  తిని  అడవిని నమ్ముకొని  పోడుభూమిని సాగు చేసినవాడే నిజమైన ఆదివాసీ బిడ్డ
Published On
కొత్తపేట లో ఘనంగ ప్రపంచ ఆదివాసుల దినోత్సవం.  మరం భీం విగ్రహానికి పూలమాలలు వేసిన ఆదివాసులు

 లోకల్ గైడ్ న్యూస్  ఆగస్టు 9
 బయ్యారం న్యూస్  

 మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామం లో ఈ రోజు ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా  ఆదివాసులు అందరూ ర్యాలీలో  తండోపతండా లుగా వివిధ గ్రామాల నుంచి విచ్చేసి పాల్గొనడం జరిగింది. కొత్తపేట సెంటర్లో ఆదివాసిల సమక్షంలో   మెస్సు రాజశేఖర్ జెండా ఎగరవేయడం జరిగింది . అక్కడనుండి  తండోపతండాలుగా ఆదివాసీలందరూ  కొమరం భీం విగ్రహాన్ని దగ్గరికి బయలుదేరి కొమరం భీం విగ్రహానికి పూలమాలలు  వేసి ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవటం  జరిగింది. జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో  అతను ఎట్లా అయితే పోరాటం చేశారో స్ఫూర్తితో ఆదివాసులంతా ఐక్యమత్యంతో కలిసి మనకున్న హక్కులను కాపాడు కుంటూ మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లవలసిన బాధ్యత అందరి మీద ఉందని అన్నారు ఈ కార్యక్రమం  ఆదివాసీ మహిళలు యువతి  యువకులు  ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News