రైతు విజ్ఞాన కేంద్రానికి భూమి పూజ

Published On
రైతు విజ్ఞాన కేంద్రానికి భూమి పూజ

నారాయణపేట మండలం

లింగంపల్లి గ్రామ శివారులో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ప్రియాంక, ప్రొఫెసర్ అల్డాస్ జానయ్య,  గ్రామ సర్పంచి భాగ్యతో కలిసి బుధవారం భూమి పూజ నిర్వహించారు.రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరి జ్ఞానం, ఉద్యాన పంటల సాగు, అధిక దిగుబడులు సాధించే విధానాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఉపయోగప డుతుం దని అధికారులు తెలిపా రు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివ రెడ్డి, జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు కుంభం శివ కుమార్ రెడ్డి, యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ డా. ఎం. యాకాద్రి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొనంగేరి హనుమంతు, మార్కెట్ కమిటీ సభ్యులు, మండలానికి చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:13.భూమి మీద చేసిన కలెక్టర్ 
--------------------------------------

Tags:

About The Author

Latest News