సంగారెడ్డిలో ఘనంగా మన్నె సంఘం బోనాల ఉత్సవాలు  హాజరైన చింతా సాయినాథ్ 

Published On
సంగారెడ్డిలో ఘనంగా మన్నె సంఘం బోనాల ఉత్సవాలు  హాజరైన చింతా సాయినాథ్ 

 

లోకల్ గైడ్ సంగారెడ్డి :

సంగారెడ్డి పట్టణంలో మన్నె సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్  తనయుడు చింత సాయినాథ్  హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఐబీ నుంచి అస్తబల్ వరకు బోనాల ఊరేగింపు వైభవంగా కొనసాగింది. ఊరేగింపులో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, నృత్యాలతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. చింత సాయినాథ్ చిందులు వేస్తూ సందడి చేశారు.ఈ సందర్భంగా చింత సాయినాథ్ మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ నాని, నారాయణ, వెంకటేశం, మన్నె సంఘం నాయకులు, మహిళలు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ
    ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగష్టు 24 (లోకల్ గైడ్) : కారేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడు నెలల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీని కారేపల్లి పోలీసులు
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో గ్రామ/వార్డు సభలు నిర్వహించాలి 
ఖమ్మం వైద్యరంగంలో నవశకం...50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం..
రాష్ట్రం లో అన్ని ప్రాంతాలను సమానాభివృద్ది పథంలో  నడిపిస్తోన్నాం.
ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి 
సర్పంచ్ పూసం ఎల్లయ్య ఆధ్వర్యంలో గేట్ కారేపల్లిలో ఫాగ్గింగ్
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం...