విద్యుత్ అంతరాయాలకు చెట్ల కొమ్మలు తొలగింపు

మణికొండలో ప్రజా బాట కార్యక్రమం

Published On
విద్యుత్ అంతరాయాలకు చెట్ల కొమ్మలు తొలగింపు

గండిపేట, ఆగస్టు 11 (లోకల్ గైడ్),

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన“ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా, 127–మణికొండ డివిజన్‌లోని తానిషా ( హెచ్ యు డి ఏ) కాలనీలో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ అధికారులు చేపట్టారు. ఇబ్రహీం బాగ్ విద్యుత్ శాఖ డి ఈ రమేష్ చంద్ర, ఏడిఈ సైదులు, ఏఈ సంతోష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్, మీడియా అండ్ కమ్యూనికేషన్ వాసిరెడ్డి నరేష్ మాట్లాడుతూ, ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించడంతో పాటు విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు విద్యుత్ శాఖ చేపడుతున్న ముందస్తు చర్యలు అభినందనీయమన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటికి తక్షణ పరిష్కారం చూపడమే ప్రజాబాట కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

IMG-20260811-WA0092ఈ సందర్భంగా తానిషా కాలనీ వాసులు విద్యుత్ శాఖ అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం వల్ల విద్యుత్ అంతరాయాలు తగ్గడంతో పాటు ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని వారు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ అధికారులకు, సిబ్బందికి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐసిసి కోఆర్డినేటర్ నుమాన్, తానిషా కాలనీ సొసైటీ అధ్యక్షులు సీతారామదాస్ కార్యవర్గ సభ్యులు,ఆల్ కాలనీస్ ఫెడరేషన్ అధ్యక్షులు వంశీ  తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రాందాస్ నాయక్ అభివృద్ధి బాటకు ఆకర్షణ.. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై! రాందాస్ నాయక్ అభివృద్ధి బాటకు ఆకర్షణ.. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై!
ఎమ్మెల్యే నాయకత్వం, నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై హస్తం గూటికి చేరిక
యునైటెడ్ దళిత క్రిస్టియన్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం.
ఎన్ఎస్పీ కెనాల్ పక్కన శివాలయంలో ప్రత్యేక పూజలు
విద్యుత్ అంతరాయాలకు చెట్ల కొమ్మలు తొలగింపు
బీఆర్ఎస్ కార్యకర్త బాల కిష్టయ్య అనారోగ్యంతో మృతి చెందడం పట్ల సంతాపం...
ఘనంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దంపతుల వివాహ వేడుకలు...
సత్తుపల్లి  ఎమ్మెల్యే  డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పుట్టినరోజు సందర్బంగా , మున్సిపాలిటీలో, 3 వ వార్డ్,   వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు నివాసం లో మున్సిపల్ చైర్మన్