లోకల్ గైడ్/తాండూర్:
తాండూర్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భాగివి భద్రేశ్వర దేవాలయ దుకాణ సముదాయాల నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టినట్లు వీరశైవ సమాజ సభ్యులు ప్రవీణ్ పటేల్ ఆరోపించారు.ఈ సందర్భంగా ప్రవీణ్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ….. దేవాలయ కమిటీ ఈఓ కుమ్మక్కై దాదాపు రూ. 3.5 కోట్ల విలువైన దుకాణాలను అక్రమంగా నిర్మించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి దేవాలయ ఆదాయానికి గండి కొట్టారు అని ఆరోపించారు. ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం 5ఏళ్లకు ఒక సారి రిటైడర్లు వెయ్యాల్సి ఉంది. కానీ లైఫ్దే టైం సెటిల్మెంట్ అని వసూళ్లు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదాయ శాఖ చట్టం ప్రకారం వెంటనే పబ్లిక్ నోటిఫికేషన్ విడుదల చేయాలని,అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్లను వెంటనే దేవాదాయ శాఖ ఖాతాలో జమ చేయాలన్నారు. నియమ నిబంధనలు పాటించని అధికారులపై, రెవల్యూషన్ కమిటీపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కోర్టు ఆదేశాల నేపథ్యంలో, అధికారులు రంగంలోకి దిగి దుకాణాలను మూసివేయించారు. సరైన అనుమతులు పొంది, చట్టబద్ధంగా ప్రక్రియ పూర్తి చేసే వరకు ఈ దుకాణాలు తెరిచే ప్రసక్తి లేదని హెచ్చరించారు.