భద్రాచలం గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం గుర్తించిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వండి

Published On

 

భద్రాచలం : లోకల్ గైడ్ న్యూస్ :
భద్రాచలం గోదావరి నదీ ప్రవాహంలో కొట్టుకువచ్చిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం భద్రాచలం వైకుంఠధామం సమీపంలోని ఒడ్డుకు చేరింది. మృతుడి వివరాలు వయస్సు సుమారు 50–60 సంవత్సరాలు, చర్మం ఎరుపు రంగు, తల చిన్న బట్టతల, తెల్లని జుట్టు, ఎత్తు సుమారు 5 అడుగులు, దుస్తులు సిమెంట్ రంగు షర్టు, ఆకుపచ్చ (గ్రీన్) రంగు షార్ట్ ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ను సంప్రదించి సమాచారం అందించగలరు. గోదావరి ఎగువ ప్రాంతాలైన ఎటపాక, చెన్నంపేట, చింతలగూడెం, కన్నాయిగూడెం, తూర్పాక, నరసాపురం, గంగోలు, దుమ్ముగూడెం, పర్ణశాల తదితర గ్రామాల ప్రజలు ఈ ఫోటోను పరిశీలించి, మృతుడిని గుర్తించే అవకాశం ఉంటే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి. ఈ గుర్తుతెలియని వ్యక్తి ఫోటోను సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు మరియు ఇతర మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేసి, మృతుడి వివరాలు గుర్తించేందుకు పోలీసులకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. సంప్రదించవలసిన నంబర్లు : ఎస్ హెచ్ వో, భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్  8712682105, 8712682160

Tags:

About The Author

Latest News