రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న స్పీకర్‌ను అవమానించడం చాలా బాధాకరం.

సామాజిక వేత్త, న్యాయ విశ్లేషకులు రామస్వామి.

రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి.
Published On
రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న స్పీకర్‌ను అవమానించడం చాలా బాధాకరం.

 

 

 

లోకల్ గైడ్,పరిగి.


గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న దళిత స్పీకర్‌ పై అనుచిత వ్యాఖ్యలు,మరియు అసభ్య పదజాలం ఉపయోగించడం తీవ్ర ఆవేదనను కల్గిస్తున్నదని సామజిక వేత్త, విశ్లేషకులు రామస్వామి ఆరోపించారు.
 ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ స్థానానికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుందని,అలాంటిది ఒక దళిత వర్గానికి చెందిన స్పీకర్‌పై అంతటి అసభ్య పదజాలంతో దూషించడం న్యాయం కాదన్నారు.రాజ్యాంగ పరమైన పదవి పొందుటకు కోసం అత్యధిక ఓట్లు దళితులవే ఉంటాయనే సత్యాన్ని గుర్తించాల్సి భాద్యత ఉండాలన్నారు.కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో పౌరుష పదజాలన్నికి తావులేదని తెలిపారు.
 తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, స్పీకర్‌కు మరియు దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని సామాజిక వేత్త, విశ్లేషకులు రామస్వామి అయన డిమాండ్ చేశారు.

Tags:

About The Author

Latest News