పేటలో వామ పక్షాల జైల్ భరో

Published On
పేటలో వామ పక్షాల జైల్ భరో

నారాయణపేట ఆగస్టు 10:

కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నారాయణపే టలో సోమవారం వామ పక్షాల నాయకులు జైల్ భరో కార్యక్రమం నిర్వహిం చారు.వ్యతిరేక విధానాలు మానుకోవాలని కార్మిక -రైతు సంఘాల నాయకు లు డిమాండ్ చేశారు.కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు రైతులు స్థానిక మున్సిపల్ పార్కు దగ్గర సభ నిర్వహించి అనంతరం పాత బస్టాండ్, నర్సిరెడ్డి చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయ కులు మాట్లాడుతూ కేంద్రం అనునిత్యం కార్మికులకు,  రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్స్ కు అనుకూలం గా తమ విధానాలు కొనసాగి స్తున్ననీ అన్నారు. కార్పొరేట్లకు పదహారు లక్షల కోట్ల రూపాయలు రుణాలు రద్దు చేసిన మోడీ యువతకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ, కార్మికులకు కనీస వేతనాలు, విద్యార్థులకు ఫీజు నెంబర్స్మెంట్ స్కాలర్షిప్, ఇవ్వడంలో వివక్షత చూపుతున్న దన్నారు.దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటూ సామ్రాజ్యవాద అమెరికాకు లొంగిపోయి తమ విధానాలు కొనసాగిస్తు నందన్నారు. జాతీయోద్య మ స్ఫూర్తితో పోరాడాలని, అందులో భాగంగానే  కార్మికులు రైతులు తమ హక్కులను సాధించుకో బడతారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటి యు జిల్లా కార్యదర్శి బలరాం, జిల్లా ఉపాధ్యక్షు లు వెంకట్రాంరెడ్డి,  టి యు సి ఐ జిల్లా కార్యదర్శి బోయిన్ బోయిన్పల్లి రాము, జిల్లా ఉపాధ్యక్షులు కాశీనాథ్, బి నరసింహ, ఏఐయుకేఎస్ జిల్లా కార్యదర్శి యాదగిరి,  నాయకులు ఛన్నా రెడ్డి,  ఏ ఐ పీ కే ఎం ఎస్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:9.

Tags:

About The Author

Latest News

మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ
    ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగష్టు 24 (లోకల్ గైడ్) : కారేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడు నెలల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీని కారేపల్లి పోలీసులు
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో గ్రామ/వార్డు సభలు నిర్వహించాలి 
ఖమ్మం వైద్యరంగంలో నవశకం...50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం..
రాష్ట్రం లో అన్ని ప్రాంతాలను సమానాభివృద్ది పథంలో  నడిపిస్తోన్నాం.
ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి 
సర్పంచ్ పూసం ఎల్లయ్య ఆధ్వర్యంలో గేట్ కారేపల్లిలో ఫాగ్గింగ్
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం...