స్పీకర్‌పై నోరు పారేసుకుంటే.. చట్టం ఊరుకోదు!...అజ్మీర నరేష్ కుమార్ డిమాండ్ 

అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి కఠిన చర్యలు తీసుకోవాలి

Published On
స్పీకర్‌పై నోరు పారేసుకుంటే.. చట్టం ఊరుకోదు!...అజ్మీర నరేష్ కుమార్ డిమాండ్ 

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 8, లోకల్ గైడ్ న్యూస్ :

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై హైదరాబాద్‌లో చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను తెలంగాణ పోలీస్ శాఖ సుమోటోగా స్వీకరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీర నరేష్ కుమార్ డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌పై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా బాధించిందని ఆయన అన్నారు. వివిధ వార్తా మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైన వీడియోలు, వ్యాఖ్యలను పోలీసులు పరిశీలించి సుమోటోగా కేసు నమోదు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలను కించపరిచేలా వాట్సాప్, సామాజిక మాధ్యమాల ద్వారా అవమానకర పోస్టులు పెట్టడం, ఇతరుల సమక్షంలో అగౌరవపరచడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణించాలని నరేష్ కుమార్ తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే చట్టపరమైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవుల గౌరవాన్ని, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ప్రభుత్వం, పోలీస్ శాఖ తక్షణమే స్పందించాలని అజ్మీర నరేష్ కుమార్ కోరారు.

Tags:

About The Author

Latest News

మహిళా ప్రజాప్రతినిధులపై నిర్బంధమా? మహిళా ప్రజాప్రతినిధులపై నిర్బంధమా?
​రింగ్ రోడ్ కూడలిలో ఉద్రిక్తత.. అడ్డుకున్న పోలీసులతో నేతల వాగ్వాదం ​అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలనపై నిరసన గళం
స్పీకర్‌పై నోరు పారేసుకుంటే.. చట్టం ఊరుకోదు!...అజ్మీర నరేష్ కుమార్ డిమాండ్ 
రైతు వేదికలో సన్న రకాల వరి సాగు నమోదు పత్రాల స్వీకరణ
రాష్టాన్ని  సంక్షోభం లోకి నెట్టిన అసమర్థ కాంగ్రేస్   ప్రభుత్వం .
మట్టి వినాయకుడినే పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం!”
దళిత వ్యతిరేకి బీ ఆర్ ఎస్ పార్టీ...అధికారం కోల్పోయామనే అక్కసుతో దళితుల పట్ల సంస్కార హీనంగా ప్రవర్తించిన బిఆర్ఎస్ ఎంఎల్సీ తాత మధు.
7వ వార్డులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ