- District News
- యాదవుల మధ్య ఐకమత్యం లేదనే భావనను తీసివేసి మేమంతా ఒకటే అనే భావన ను ఆచరణలో నిరూపించాలి
యాదవుల మధ్య ఐకమత్యం లేదనే భావనను తీసివేసి మేమంతా ఒకటే అనే భావన ను ఆచరణలో నిరూపించాలి
.
మహబూబాబాద్ జిల్లా తెలంగాణ యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు సూత్రపు రాజు యాదవ్ మాట్లాడుతూ
యాదవులు
అన్ని శాఖలు కలిసి ఒకే భావంతో యాదవ్ గా కొనసాగాలి.
యాదవులు వివిధ శాఖలుగా విడిపోవడం వలన బలహీన పడతారు.
యాదవులు పార్టీ విభేదాలు వదలి కలిసిమెలిసి సోదర భావంతో జీవించాలి.
యాదవులు సమిష్టి నిర్ణయం, సమిష్టి ఆలోచన, సమిష్టి ప్రయోజనం దిశగా అడుగులు వేయాలి.
యాదవుల మధ్య ఐకమత్యం లేదనే భావనను తీసివేసి మేమంతా ఒకటే అనే భావన ను ఆచరణలో నిరూపించాలి.
రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సంఘాలన్నీ కలిసి ఒకే వేదికగా యాదవ జాతి ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితి కొరకు రాజీలేని పోరాటం చేయాలి.
యాదవులు వివిధ రాజకీయ పార్టీల విభేదాల కారణంగా గొడవలు పడి నష్టపోతున్నారు.
యాదవులు వివిధ సంఘాలుగా విడిపోయి ఐకమత్యంగా లేకపోవడం వలన నష్టపోతున్నారు.
యాదవులు వ్యక్తిగత ఎజెండాల కోసం కాకుండా, యాదవ జాతి ఎజెండా కోసం పని చేస్తే యాదవ జాతి కోల్పోయిన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది.
కావున యాదవ జాతి ముందున్న ఏకైక లక్ష్యం ఒక్కటే
అందరం కలిసి మెలిసి ఉండి ఐకమత్యంతో అధికారాన్ని పొందడం.
యాదవులు శాకలకతీతంగా పార్టీలకతీతంగా
గ్రూపుల కతీతంగా
ఐకమత్యంతో అవగాహనతో
అన్ని రంగాలలో నూటికి నూరు శాతం అభివృద్ధి చెందాలి.
యాదవులు విద్యా, ఉద్యోగ, ఉపాధి, సామాజిక, సాంస్కృతిక, పారిశ్రామిక, రాజకీయ, వైద్య, వ్యాపార, సినీ, మీడియా, ఆధ్యాత్మిక, సేవా రంగాలలో అభివృద్ధి చెందాలి.
యాదవుడా మేలుకో!
నీ రాజ్యం నీవే ఏలుకో.
జనం మనది బలం మనది ఏకమైతే రాజ్యాధికారం మనదే.
పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.
అడుక్కుంటే అధికారం రాదు, హక్కుగా పోరాడి సాధించుకుందాం రండి.
ఎక్కే సింహాసనం మొక్కితే రాదు గుద్ది గుంజుకుందాం రండి.
అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారమే,
రాజ్యాధికారాన్ని పోరాడి సాధించుకుందాం రండి.
రాజ్యం వీర భోజ్యం
వీరుని వరిస్తుంది.
యాదవ సోదరీ, సోదరులు
యాదవ జాతి హక్కుల కోసం, అభివృద్ధి కోసం, అధికారం కోసం పులులు, సింహాలై గర్జించాలి.
యాదవ విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, కవులు ,కళాకారులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, మహిళలు, సమస్త యాదవ జాతి ఉద్యమ బాట పట్టాలి తెలంగాణ యాదవ మహాసభ సూత్రపు రాజు యాదవ్
జిల్లా అధ్యక్షుడు ఆయన తెలిపారు
