రైతు వేదికలో సన్న రకాల వరి సాగు నమోదు పత్రాల స్వీకరణ

Published On
రైతు వేదికలో సన్న రకాల వరి సాగు నమోదు పత్రాల స్వీకరణ

మాగనూర్, సెప్టెంబర్ 8:

మాగనూర్ మండల కేంద్రం లోని రైతు వేదికలో మంగ ళవారం  జిల్లా వ్యవసాయ అధికారి యం. సక్రియ నాయక్ రైతుల నుండి ప్రభుత్వం నిర్దేశించిన 7 రకాల సన్న రకాల వరి సాగుకు సంబంధించిన నమోదు పత్రాలను స్వీక రించారు.ఈ సందర్భంగా రైతులు సన్న రకాల వరి సాగు నమోదు విషయంలో ఎలాంటి ఆలస్యం చేయ కుండా నిర్దేశిత విధానంలో తమ వివరాలను ఆన్‌లైన్‌ లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సూచించారు.డీలర్ వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు విత్తనం కొనుగోలు చేసిన బిల్లు, పట్టాదార్ పాస్‌బుక్ జిరాక్స్ ప్రతుల ను డీలర్‌కు అందించి, తమ సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలన్నారు. కౌలు రైతులు భూ యజ మానికి సంబంధించిన పట్టాదార్ పాస్‌బుక్ జిరాక్స్ ప్రతిని డీలర్‌కు అందించి, సన్న రకాల వరి సాగు వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు. సొంత విత్తనాలు లేదా కే.వి.కే ద్వారా పొందిన విత్తనాలు వినియోగించే రైతులు తమ సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధి కారి ను సంప్రదించి, వెంట నే సాగు వివరాలను ఆన్‌లై న్‌లో నమోదు చేయించు కోవాలనీ సూచించారు.
డీలర్ ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోతే రైతులు ఆల స్యం చేయకుండా సంబం ధిత వ్యవసాయ అధికారిని  సంప్రదించి ఫిర్యాదు చేయాలని తెలిపారు.ఈ నెల10 తేదీ వరకుసన్న రకాల వరి సాగు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉన్నందున, అర్హత కలిగిన రైతులందరూ చివరి తేదీ కోసం వేచి చూడకుండా వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని  కోరారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్, ఏ  ఈ ఓ పవన్ కుమార్, డీలర్లు రైతులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:8.సన్న రకం వరి సాగు వివరాలు సేకరిస్తున్న అధికారులు
_____________________

Tags:

About The Author

Latest News

మహిళా ప్రజాప్రతినిధులపై నిర్బంధమా? మహిళా ప్రజాప్రతినిధులపై నిర్బంధమా?
​రింగ్ రోడ్ కూడలిలో ఉద్రిక్తత.. అడ్డుకున్న పోలీసులతో నేతల వాగ్వాదం ​అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలనపై నిరసన గళం
స్పీకర్‌పై నోరు పారేసుకుంటే.. చట్టం ఊరుకోదు!...అజ్మీర నరేష్ కుమార్ డిమాండ్ 
రైతు వేదికలో సన్న రకాల వరి సాగు నమోదు పత్రాల స్వీకరణ
రాష్టాన్ని  సంక్షోభం లోకి నెట్టిన అసమర్థ కాంగ్రేస్   ప్రభుత్వం .
మట్టి వినాయకుడినే పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం!”
దళిత వ్యతిరేకి బీ ఆర్ ఎస్ పార్టీ...అధికారం కోల్పోయామనే అక్కసుతో దళితుల పట్ల సంస్కార హీనంగా ప్రవర్తించిన బిఆర్ఎస్ ఎంఎల్సీ తాత మధు.
7వ వార్డులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ