- District News
- Ranga Reddy
- మట్టి వినాయకుడినే పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం!”
మట్టి వినాయకుడినే పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం!”
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
లోకల్ గైడ్
ఆమనగల్లు, సెప్టెంబర్ 8 ఆమనగల్లు:
రాబోయే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కల్వకుర్తి నియోజకవర్గం, పరిసర ప్రాంతాల ప్రజలకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలు, హానికరమైన రసాయన రంగుల వినియోగం వల్ల చెరువులు, కుంటలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన సంప్రదాయాన్ని, ప్రకృతిని కాపాడుకోవాలంటే స్వచ్ఛమైన మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని సూచించారు.
పూర్వం నుంచి మన పూర్వీకులు మట్టి విగ్రహాలనే పూజించేవారని, మట్టి వినాయకులను పూజించి నిమజ్జనం అనంతరం ఆ మట్టి తిరిగి ప్రకృతిలో కలిసేలా చేయడం ద్వారా భక్తితో పాటు పర్యావరణ బాధ్యతను కూడా నిర్వర్తించినవారమవుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వినాయక చవితి పర్వదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని ఆ గణనాథుని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.
