- District News
- Khammam
- ప్రభుత్వ పాఠశాలలో సమస్యలపై ఆరా
ప్రభుత్వ పాఠశాలలో సమస్యలపై ఆరా
సర్పంచ్ హేమలత బాలాజీ పాఠశాల సందర్శన
పొలం పల్లి, సెప్టెంబర్ 11, లోకల్ గైడ్ న్యూస్:
పొలం పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలను ఖమ్మం జిల్లా దిశ కమిటీ సభ్యురాలు, గ్రామ సర్పంచ్ హేమలత బాలాజీ సందర్శించి పాఠశాలలోని పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించిన ఆమె విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధనా విధానం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు, పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. అదేవిధంగా తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, పారిశుధ్యం, పాఠశాల పరిసరాల పరిశుభ్రత, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను పరిశీలించారు. పాఠశాలలో గుర్తించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హేమలత బాలాజీ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు గ్రామ పంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
