- District News
- Khammam
- చెరువులకు సాగునీరు.. రైతులకు భరోసా!
చెరువులకు సాగునీరు.. రైతులకు భరోసా!
చీమలవారిగూడెం కట్టు నుంచి అనంతారం, గేట్ కారేపల్లి చెరువులకు నీరు అందించేలా ప్రణాళిక
ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగష్టు 10 : రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమలరావు చొరవ తీసుకున్నారు. చీమలవారిగూడెం కట్టు నుంచి అనంతారం, గేట్ కారేపల్లి చెరువులకు సాగునీరు అందించేలా చేపట్టాల్సిన నీటి ప్రణాళికను స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ను కలిసి వివరించారు.
చెరువులకు నీరు అందుబాటులోకి వస్తే పరిసర ప్రాంతాల్లోని రైతులకు సాగునీటి ఇబ్బందులు తగ్గడంతో పాటు వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని తిరుమలరావు తెలిపారు. వర్షాలపై ఆధారపడే రైతులకు సాగునీటి భరోసా కల్పించేలా ఈ ప్రణాళికను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు.
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సాగునీటి వసతుల మెరుగుదలకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్కు, రైతుల సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్న గుడిపూడి తిరుమలరావుకు రైతులు అభినందనలు తెలిపారు. ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చితే ప్రాంతంలోని రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
