తలసేమియా వ్యాధి చిన్నారులకు రక్తదానం

ఏ సి ఎఫ్ ప్రధాన కార్యదర్శి నరేందర్ బాబు 

Published On
తలసేమియా వ్యాధి చిన్నారులకు రక్తదానం

గండిపేట్, ఆగస్టు 9 (లోకల్ గైడ్):

తల సేమియా వ్యాధి చిన్నారులకు రక్తదానం చేయండి ప్రాణదాతలు గా నిలవండి అని హైదర్షకోట్ ఆల్ కాలనీస్ ఫెడరేషన్ (ఏసిఎఫ్) ప్రధాన కార్యదర్శి నరేందర్ బాబు అన్నారు. ఆదివారం  రాజేంద్రనగర్ సర్కిల్ కిస్మత్పూర్ పరిధిలోని గిరి దారి అవిఘ్న అపార్ట్మెంట్ లో  లెట్స్ హెల్ప్ సంవన్ ఎన్జీవో ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ....          రక్తదానం చేయడం అత్యంత గొప్ప మానవతా సేవ, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి 15 నుండి 45 రోజుల వరకు ఒకసారి రక్తం అవసరం అవుతుందని అందుకే నిత్యం రక్తదాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. ఇది ఆపదలో ఉన్నవారికి ప్రాణం పోస్తుంది.  ఒక వ్యక్తి చేసే ప్రతి రక్తదానం ముగ్గురు ప్రాణాలను కాపాడుతుంది. ఈ శిబిరంలో నరేందర్ బాబు 42 వ సారి రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో ప్రతినిధులు నికిత, రమీజ్, జయసింహారెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
పాముకాటుతో మహిళ మృతి.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.
తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 
శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు