- District News
- Khammam
- ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కౌశిక్ రెడ్డి...
ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను
ఖండించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్.
సత్తుపల్లి, ఆగస్టు,14: లోకల్ గైడ్:
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై కౌశిక్ రెడ్డి దురుసుగా మాట్లాడుతూ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్.
- 2018 కాంగ్రెస్ పార్టీ నుంచి BRS పార్టీ లోకి చేరింది నీవు.
- మా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని విమర్శించే స్థాయి నీది కాదు.
- స్వతహాగా కాంట్రాక్ట్ వర్కులు చేస్తూ అభివృద్ధి చెందిన నాయకులు మా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
- నీవు గొప్పలు చెప్పుకుంటున్న BRS పార్టీ హయంలో పేదలకు ఎన్ని ఇండ్లు ఇచ్చారు.
- కాంగ్రెస్ ప్రభుత్వం నియోజక వర్గానికి 3 వేల 500 ఇండ్లు ఇచ్చిన ఘనత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
- మంత్రి పొంగులేటి పెద్ద తరహాగా మాజీ సిఎం కేసీఆర్ కాళ్ళకు దండం పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు.
- అంతే గాని కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మా మంత్రి కి లేదు.
- అప్పట్లో పదవులు ఇస్తామని నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసిన వ్యక్తి మీ కేసీఆర్.
- ప్రజల నుంచి వచ్చిన నాయకుడు మా మంత్రి పొంగులేటి.
- ఉమ్మడి ఖమ్మం జిల్లా లో తుమ్మల, పొంగులేటి లాంటి నాయకులను వదులుకొని ఘోరంగా ఓడిపోయిన పార్టీ BRS.
- ప్రజలు ఆదరించారు కాబట్టే మా నాయకులు గెలిచి చూపించారు.
- రాబోయేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే.
- ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది మీ KCR.
- పదవులు అన్ని కుటుంబానికే ఇచ్చుకున్నారు కాబట్టే ప్రజలు బుద్ది చెప్పారు.
