అమ్మ’కు బోనాలు..జగతికి భాగ్యాలు

మల్లాపూర్ మాజీ ఉపసర్పంచ్ పిన్నింటి హరిత మధుసూదన్ రెడ్డి*

అమ్మవారికి బోనమెత్తిన పిన్నింటి హరిత
Published On
అమ్మ’కు బోనాలు..జగతికి భాగ్యాలు

త్తూరు ఆగస్టు 10 (లోకల్ గ్రైడ్)

ప్రకృతిని శక్తిస్వరూపిణిగా, జగన్మాతగా కొలవడం భారతీయ సంప్రదాయం అని ప్రకృతిశక్తుల విభిన్న కళలే గ్రామదేవతలని దేవీ భాగవతం అని ఆమె పేర్కొన్నారు. కొత్తూరు మండలం లోని మల్లాపూర్ గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ పిన్నింటి హరిత మధుసూదన్ రెడ్డి అమ్మవారికి బోనం ఎత్తి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అమ్మవారికి భక్తితో సమర్పించే పప్పు అన్నాన్ని బోనం అంటారు.ఇది భోజనం అనే మాట నుంచి వచ్చింది. ‘భోజనం’ ప్రకృతి కాగా, ‘బోనం’ వికృతి అని చెబుతారు.వేకువజామునే తలస్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించి కొత్తకుండలో బియ్యం,పాలు,నెయ్యి,చక్కెర కలిపి నైవేద్యం తయారు చేస్తారు.మట్టి లేక రాగి పాత్రలో వండుతారు.ఈ పదార్థాలతో కూడిన నైవేద్యంతో పాటు భక్తులు తమ మొక్కుబడులకు అనుగుణంగా కూడా ప్రసాదాలు తయారు చేసి అమ్మవారికి పెడుతారు అని ఆమె అన్నారు.

Tags:

About The Author

Latest News

వీరనాగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.80 లక్షల సహకారం వీరనాగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.80 లక్షల సహకారం
న్యూస్ స్టార్     లోకల్ గైడ్ – ఆమనగల్లు, ఆగస్టు 10: మాడుగుల మండలం దొడ్లపహాడ్ గ్రామంలో నూతనంగా విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తిచేసుకున్న వీరనాగమ్మ దేవత ఆలయంలో 41...
అమ్మ’కు బోనాలు..జగతికి భాగ్యాలు
గ్రామానికి వెలుగు వస్తే ప్రజలకు భద్రత ఉంటుంది.
మత్స్యకారులకు సామాజి క భద్రత ...తెలంగాణ ప్రభుత్వ భరోసా
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ 
తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకం