గణనాథుడికి నిశాంక్ కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు.

పసారి వార్డులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు.

పూజల్లో పాల్గొన్న యువకులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు
Published On
గణనాథుడికి నిశాంక్ కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు.

లోకల్ గైడ్/తాండూర్:
తాండూర్ పట్టణంలోని పసారి వార్డులో వినాయక చవితి వేడుకలు సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పసారం నిశాంక్ కుటుంబ సభ్యులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పాలు, పండ్లు సమర్పించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలిచారు.
ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో వార్డుకు చెందిన యువకులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో వార్డులో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొనగా, యువకులు పూజా కార్యక్రమాల నిర్వహణలో తమవంతు సహకారం అందించారు.
వినాయకుడి పూజల సందర్భంగా వార్డు మొత్తం భక్తి భావంతో నిండిపోయింది. గణనాథుడి నామస్మరణతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని పసారం నిశాంక్ దంపతులు ఆకాంక్షించారు.

Tags:

About The Author

Latest News