- District News
- కబడ్డీలో పెద్దేముల్ లయన్స్ జోరు.
కబడ్డీలో పెద్దేముల్ లయన్స్ జోరు.
నియోజకవర్గ స్థాయి పోటీల్లో ఛాంపియన్గా నిలిచిన పెద్దేముల్ జట్టు
లోకల్ గైడ్/తాండూర్:
తాండూర్ హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో అక్షర కాన్సెప్ట్ స్కూల్ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీల్లో పెద్దేముల్ లయన్స్ జట్టు విజేతగా నిలిచింది. కోట్పల్లి కింగ్స్ జట్టు రన్నరప్గా నిలిచింది.
నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన ఈ పోటీలకు శ్రీ సాయిపుత్ర హోమ్స్ అధినేత బావనోళ్ల శంకర్యాదవ్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించారు. ఈ క్రమంలో విజేతలకు శంకర్యాదవ్ బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా గౌతమి మోడల్ స్కూల్ కరస్పాండెంట్, టీం స్పాన్సర్ పి. మహిపాల్రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. పెద్దేముల్ లయన్స్ జట్టు విజేతగా నిలవడంపై క్రీడాకారులను అభినందించారు.
కార్యక్రమంలో ధార్మిక పరిషత్ సభ్యులు విజయ్కుమార్, వేణుగోపాల్రెడ్డి, ఓం ప్రకాష్ సోమని, టీం స్పాన్సర్లు అజయ్ ప్రసాద్, మనోహర్, డాక్టర్ శరత్ చంద్ర, రాములు, కిషన్, మార్వాడీ యువమంచ్ నాయకులు రాజ్కుమార్, పీటీలు రాధాకృష్ణ, గోపాల్, అంపైర్లు రాము, రవి, ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
