- District News
- సుల్తానాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో వాహనాల వేలం పాట
సుల్తానాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో వాహనాల వేలం పాట
Published On
By Ram Reddy
పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
ఆగస్టు 24 (లోకల్ గైడ్)
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు తేదీ: 25.08.2026 (మంగళవారం) ఉదయం 10:00 గంటలకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు సుల్తానాబాద్ ఎక్సైజ్ సీఐ గురునాథ్ రాథోడ్ తెలిపారు.ఈ వేలం పాటను జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి (డీపీఈఓ), పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.వేలం పాటలో పాల్గొనదలిచిన వారు తమ ఆధార్ కార్డు జిరాక్స్ వెంట తీసుకురావాలని, అలాగే తాము బిడ్ చేయదలిచిన వాహనం విలువలో 50% ఈఎండీ (ఈఎండి) మొత్తాన్ని ముందుగా డిపాజిట్ చేసి వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.ఆసక్తి గల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సుల్తానాబాద్ ఎక్సైజ్ అధికారులు కోరారు.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Sep 2026 21:20:58
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ తాతా మధు దూషించడం సరికాదని ఫరూక్నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్...
