రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వాసులు కమ్యూనిస్టులేనని రంగారెడ్డి జిల్లా రైతు సంఘం నాయకులు విక్రమ్ అన్నారు. సిపిఎం పార్టీ రాజేంద్రనగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజేంద్రనగర్ డివిజన్ కేంద్రంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సదస్సు కాటేదాన్ లోని సిఐటియు రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. సిపిఎం మండల కమిటీ సభ్యులు రామ్ మోహన్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు మాత్రమే అని అన్నారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం1946 నుంచి 1951 వరకు జరిగిందని అప్పటికి బిజెపి పార్టీ పుట్టలేదని అన్నారు భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం ఎర్రజెండా నాయకత్వం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందని మూడువేల మంది ఎర్రజెండా నాయకులు అమరులై 4వేల గ్రామాలకు విముక్తి కలిగించాలని పది లక్షల ఎకరాల భూములు పేదలకు పంచారని అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో ఏమాత్రం సంబంధంలేని ఆర్ఎస్ఎస్ బిజెపి నాయకులు చరిత్రను వక్రీకరించి ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు జరిపిన పోరాటంగా వక్రీకరిస్తున్నారని అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కులాలకు మతాలకు అతీతంగా షేక్ బందగి దొడ్డి కొమురయ్య చాకలి ఐలమ్మ పుచ్చలపల్లి సుందరయ్య లాంటి కమ్యూనిస్టు నాయకులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు రాజేంద్రనగర్ మండల కార్యదర్శి జాజాల రుద్ర కుమార్, మండల కమిటీ సభ్యులు. చుక్క మోహన్ .కాలె రాజు బచ్చలకూర స్వామి. బి వెంకటయ్య..సిపిఎం పార్టీల శంషాబాద్ మండల కన్వీనర్ మల్లేష్. మండల కమిటీ సభ్యులు వెంకటేష్. స్వప్న, పార్టీ సభ్యులు ప్రజాసంఘాల నాయకులు కార్మికులు పాల్గొన్నారు.