పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాల్సిందే. 

జేఏసీ చైర్మన్ యశ్వంత్, కన్వీనర్ డా. రామారావు 

Published On
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాల్సిందే. 



రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ):                  ఉద్యోగస్తుల పట్ల శాపంగా మారిన సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి టిజీఈజేఏసీ రంగారెడ్డి జిల్లా చైర్మన్ యశ్వంత్ కోరారు. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో  కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. 
ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు,ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో సిపిఎస్ ను రద్దుచేసి ఓ పి ఎస్ ను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సీ పి ఎస్ అనేది ఉద్యోగస్తుల పట్ల శాపంగా మారిందని, ఈ సిపిఎస్ను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉద్యోగ జేఏసీ కార్యాచరణలో భాగంగా సెప్టెంబర్ 10వ తేదీన "చలో హైదరాబాద్ " కార్యక్రమాన్నిచేపడుతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అదే విధంగా  రంగారెడ్డి జిల్లాటి జీ ఈ జే ఏ సీ కన్వీనర్ డాక్టర్ రామారావు మాట్లాడుతూ సీ పి ఎస్ అనేది చాలా ప్రమాధకరమైనదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లో సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ హామీని దాటవేయటం సరైంది కాదన్నారు. 
ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, నాలుగవ తరగతి ఉద్యోగులు, కార్మికులు,  పెన్షనర్లు అందరూ ఐక్యంగా ముందుకు వచ్చి తమ సంపూర్ణ మద్దతును తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వినర్ శ్రీనేష్ కుమార్ నోరి, కో చైర్మన్లు గోపాల్, ప్రవీణ్, శాంతి శ్రీ, సుధాకర్,రాజేష్, బల్వంత్ రెడ్డి,వైస్ చైర్మన్లు నూతనకంటి వెంకట్, సైదమ్మ, రాకేష్, సెక్రెటరీలు , మాధవ్ , ఆనంద్, మహేష్, ప్రమీల,వెంకటప్ప,పాండు రంగారెడ్డి, కల్పన, జగన్నాథ్ శర్మ,అరుణ,గౌస్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుకుందాం
లోకల్ గైడ్ షాద్ నగర్  కేశంపేట: వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కేశంపేట మాజీ జడ్పిటిసి విశాల...
ముందస్తు అరెస్టులు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు
ముగిసిన శ్రావణ మాస భజన కార్యక్రమం.
మహాదేవపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ధర్నా
మట్టి వినాయకుని పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం* - కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో మట్టి వినాయకుల తయారీపై విద్యార్థులకు అవగాహన
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మహాశిల్పులు గురువులు.
మృతురాలి రేషన్‌ కార్డుతో రెండేళ్లుగా బియ్యం స్వాహా? - చనిపోయిన బాలమ్మ పేరుతోనే కార్డు కొనసాగింపు.