రేపటి సీఎం రేవంత్ రెడ్డి పాలేరు నియోజకవర్గ పర్యటనను జయప్రదం చేయండి : తుంబూరు దయాకర్ రెడ్డి పిలుపు

సమాచార శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మన పాలేరు.

రేపటి సీఎం రేవంత్ రెడ్డి పాలేరు నియోజకవర్గ పర్యటనను జయప్రదం చేయండి : తుంబూరు దయాకర్ రెడ్డి పిలుపు

లోకల్ గైడ్ పాలేరు: మన ప్రియతమ నేత, తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మన పాలేరు  నియోజకవర్గంలో ఈ నెల 18న ఆదివారం (రేపు) ఉదయం 10:30 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పర్యటించనున్నారు. ఈ పర్యటనను భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పొంగులేటి గారి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

మద్దులపల్లి వేదికగా సీఎం గారు 100 పడకల ఆసుపత్రి (కూసుమంచి), జేఎన్టీయూ కళాశాల, మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే నర్సింగ్ కళాశాల మరియు కొత్త వ్యవసాయ మార్కెట్‌ను ప్రారంభిస్తారు.

ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని  ఆత్మ కమిటీ, సీడీసీ, మార్కెట్ కమిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, దేవాలయ కమిటీ బాధ్యులు మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ ఉదయం 10:30 గంటలకే హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు