- District News
- వరంగల్ జిల్లా సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడిగా దండెం సంపత్ నియమాకం
వరంగల్ జిల్లా సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడిగా దండెం సంపత్ నియమాకం
Published On
By Ram Reddy
వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్20
(లోకల్ గైడ్ న్యూస్)
అలాగే గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం ప్రజల మధ్య పనిచేస్తున్న సర్పంచులకు ప్రస్తుతం అందుతున్న గౌరవ వేతనాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ఖర్చులు, సర్పంచుల బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని గౌరవ వేతనాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెంచాలని అన్నారు.వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన నల్లబెల్లి మండలం నార్కపేట గ్రామపంచాయతీ సర్పంచ్ దండెం సంపత్ మాట్లాడుతూ, జిల్లాలోని సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. సర్పంచుల హక్కులను కాపాడేందుకు తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ తరఫున ముందుండి పనిచేస్తానని, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు.తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ గౌరవ అధ్యక్షులు వి. శ్రీనివాస్ గౌడ్ మార్గదర్శకత్వంలో, వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ నాయకత్వంలో సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా కృషి చేస్తానని దండెం సంపత్ సర్పంచ్ నార్కపేట వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం జేఏసీ నాయకులు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
20 Sep 2026 19:19:42
అభినందించిన కరాటే మాస్టర్స్
