"శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాల సమన్వయం - శాంతి భద్రతల పరిరక్షణ

జిల్లా స్థాయి - శాంతి భద్రతల పరిరక్షణలో విశ్వహిందూ పరిషత్ సమన్వయం.. డిసిపి కి వినతిపత్రం..

సెప్టెంబర్ 14 శ్రీ గణేష విగ్రహ స్థాపన, 23 బుధవారం నిమజ్జనం.. నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం, శాంతిభద్రతలపై చర్చ..
Published On

జనగామ జిల్లా ,ప్రతినిధి సెప్టెంబర్ 11(లోకల్ గైడ్ ):-

పరస్పర సమన్వయం, సహాకారంతో శ్రీ వినాయక నవరాత్రోత్సవాలు విజయవంతం చేద్దామని జనగామ‌ డిసిపి రాజమహేంద్రనాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. సెప్టెంబర్ 14న శ్రీ గణేష విగ్రహ స్థాపన, 23 బుధవారం నిమజ్జనం జరుపుకోవాలని నవరాత్రోత్సవ తేదీలను ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక చైతన్యం తీసుకురావడానికి, కులవర్గజాతి భేదం లేని సామాజిక సమరసత సాధించడానికి నవరాత్రోత్సవాలు దోహదపడతాయని తెలిపారు. అందుకోసం పరిషత్ విస్తృతంగా కృషి చేస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా వినాయక మండప నిర్వాహకులకు పోలీస్ యంత్రాంగం మరియు ప్రభుత్వ అన్ని రకాలుగా సహకరించాలని, ఆంక్షలు అనుమతుల పేరిట ఇబ్బందులకు గురి చేయకూడదని కోరారు. పర్యావరణ పరిరక్షణ, నిమజ్జన ఏర్పాట్లు, శాంతి భద్రతలకై కృషి, నిమజ్జనం రోజున మధ్యం దుకాణాల మూసివేత వంటి అనేక అంశాలపై చర్చించి వినతిపత్రాన్ని అందించారు. అందుకు డిసిపి రాజమహేంద్రనాయక్ సానుకూలంగా స్పందించారు, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నవరాత్రులు పూర్తిచేద్దామని విహెచ్పీ సమర్పించిన అంశాలపై దృష్టి సారిస్తామని హామి ఇచ్చారు. ఈ సమావేశంలో పరిషత్ ఉపాధ్యక్షుడు బచ్చుబాలనారాయణ, కోశాధికారి దిడిగం లక్ష్మణ్, భజరంగ్దల్ శాయితేజ భార్గవ, గుమ్మడవెల్లి ఉమేష్, లింగాల ఘనపూర్ అధ్యక్షుడు శివరామకృష్ణ, సేవా ప్రముఖ్ బత్తిని శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షుడు రవికుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News