నీట్  పీ జీ  పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

Published On
నీట్  పీ జీ  పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

*

నర్సంపేట లోకల్ గైడ్ ప్రతినిధి ఆగస్టు 30:

వరంగల్: నర్సంపేటలోని బిట్స్ కాలేజీలో నిర్వహిస్తున్న నీట్ పీజీ–2026 పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్  ఆదివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, బయోమెట్రిక్, సీసీ కెమెరాల పర్యవేక్షణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, పరీక్షా నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు, తాగునీటి సౌకర్యం, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీఓ, తహసీల్దార్, బిట్స్ కాలేజీ యాజమాన్యం, పరీక్షా నిర్వహణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News