అభివృద్ధి నిరంతర ప్రక్రియ...

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు...

Published On
అభివృద్ధి నిరంతర ప్రక్రియ...

హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు12
(లోకల్ గైడ్ న్యూస్)

వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  56వ డివిజన్లో బుధవారం పర్యటించారు.56వ డివిజన్లోని వివేక నగర్,జవహర్ కాలనీ,పరిమళ కాలనీ, శ్రీ సాయి నగర్ కాలనీలలో సుమారు 3.85కోట్ల నిధులతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు,సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ...ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని, ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తామని అన్నారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా అమలు చేస్తూ డివిజన్ల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రతి గ్రామాన్ని,డివిజన్లను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.అనంతరం గోపాలపురం జంక్షన్లోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు కాలనీ వాసులకు గతంలో ఎమ్మెల్యే ని కలిసి సహాయం కోరడంతో వారికి బుధవారం ఎమ్మెల్యే 2.5లక్షల రూపాయలను వారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో 56వ డివిజన్ అధ్యక్షులు కొంకా హరిబాబు,
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కందుకూరి పూర్ణచందర్,కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యదర్శి దూలం సదానందం,సీనియర్ నాయకులు చింత రమేష్,మర్రి ప్రభాకర్,
దూలం పరమేష్,
చింతరెడ్డి రవీందర్ రెడ్డి,
నలుబాల దామోదర్, చిప్ప ప్రభాకర్,బోనగాని రాంప్రసాద్,రమేష్,డివిజన్ మహిళా అధ్యక్షురాలు శనిగరపు అనిత,మహిళ నాయకురాలు పల్లకొండ సరోజన,గుగులోతు స్వరూప,అన్న విజయ, యూత్ నాయకులు లావుడియా రవి నాయక్, పాలకొండ విజయ్ సూర్య, ఇమ్మడి రాజీవ్,సుందర్, రామకృష్ణ,సందీప్ ప్రేమ్ సాగర్,మహమ్మద్ రియాజ్, కిషోర్,గొల్లపల్లి చిరంజీవి, రవి,వంశీ,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News