ఒకే వేదికపై విజయ్ దేవరకొండ, రామ్ చరణ్
By Ram Reddy
On
లోకల్ గైడ్ : టాలీవుడ్ స్టార్ నటులు విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ ఒకే వేదికపై సందడి చేయనున్నారు. డ్రగ్స్ వ్యతిరేకంగా ఈ నటులు తమ గొంతు కలుపనున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో రామ్చరణ్, విజయ్ దేవరకొండ ప్రత్యేక అతిథులుగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం జూన్ 27న, సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికలో జరగనుంది.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, వాటి దుష్ప్రభావాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ప్రముఖ సినీ తారలు హాజరుకావడం ద్వారా ఈ సందేశం మరింత మందికి చేరుతుందని భావిస్తున్నారు.
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...