తెలంగాణలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణలో వచ్చే ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగ్లాదేశ్‌ ప్రాంతం నుంచి పశ్చిమ బెంగాల్ గంగా తీరం వరకు అల్పపీడనం కొనసాగుతుండటంతో వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, పైకి ఎగిరే కొద్దీ దక్షిణ దిశగా వంగి ఉందని వివరించింది.

జిల్లాలవారీగా వర్షాల అంచనా:

మంగళవారం: భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.

బుధవారం: భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు.

గురువారం: ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు.

శుక్రవారం: ఇవే జిల్లాలతో పాటు ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది.

శనివారం: భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని తెలిపింది.

వర్షాల కారణంగా ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే గడచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నిర్మల్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయని పేర్కొంది.

Tags:

About The Author

Latest News