కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలపై బ్యాంకుల పనితీరుపై ఆరా:కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

 కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలపై బ్యాంకుల పనితీరుపై ఆరా:కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్ఐలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ఉత్సాహంగా సాగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలపై బ్యాంకుల పనితీరును సమీక్షించారు.
గ్రామీణాభివృద్ధిలో బ్యాంకుల పాత్ర ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. ఇప్పటివరకు మంజూరైన రుణాల స్థితిగతులు, వాటి అమలుపై బ్యాంకుల ప్రతినిధులు మరియు సంబంధిత అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వ్యవసాయ రుణాలు, ముద్ర యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, పీఎం స్వనిధి, స్టాండప్ ఇండియా వంటి పథకాలలో రుణాల మంజూరు, వాటి పురోగతిని కూడా సమీక్షించారు.

Tags:

About The Author

Latest News