మియాపూర్ కి చెందిన యలమంచి ఉదయ్ కిరణ్కు
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ పట్ల నిబద్ధతతో, ప్రజల జీవితాలలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో పనిచేస్తు ప్రజల మన్ననలు అందుకుంటున్న మియాపూర్ కి చెందిన యువ నాయకుడు యలమంచి ఉదయ్ కిరణ్, ఇటీవల రెండు ప్రతిష్టాత్మక జాతీయ గౌరవాలను అందుకుని తెలంగాణకు, మియాపూర్కు గర్వకారణంగా నిలిచారు.
స్వీకరించిన అవార్డ్స్:
ఇంటర్నేషనల్ జిహెచ్ పి యూనివర్శిటీ నుండి గౌరవ హానరీ డాక్టరేట్ (సోషల్ వర్క్ లో) "సేవా రత్న జాతీయ అవార్డు" ప్రజాసేవలో అంకిత భావానికి గుర్తింపు. ఈ గౌరవాలు చెన్నైలోని భారతీయ విద్యా భవన్ వేదికగా, గౌరవనీయ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ప్రముఖ
ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు, కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, లెఫ్టినెంట్ కర్నల్ (రిటైర్డ్), భారత శిక్షా రత్న
అంతర్జాతీయ కమిషనర్ యువ వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖ డైరెక్టర్, ఇండియన్ ఆర్మీ, ఎడ్యుకేషన్ అంబాసడర్, ఇతర గౌరవనీయుల సమక్షంలో ప్రదానం చేసారు. ఈ సందర్భంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. ఈ గౌరవాలు నా వ్యక్తిగతం కాదు, మనం కలిసి చేసిన ప్రతి సేవా యాత్రకు గుర్తింపు. ప్రతి వాలంటీర్, మార్పు కోసం నడిచిన ప్రతి ఒక్కరికి ఈ పురస్కారాలు అంకితం.”
"సేవా ప్రస్థానంలో కీలక కార్యక్రమాలు"
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, జ్యామిట్రి బాక్సులు పంపిణీ,
చలివేంద్రాలు, మియాపూర్ డివిజన్లో వేసవిలో ఉచిత తాగునీరు. వృద్ధాశ్రమాలలో పండ్ల పంపిణీ, పోషకాహార పరిరక్షణ, మెగా మెడికల్ క్యాంపులు, ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ, అనాథ ఆశ్రమాల్లో ఆహార పంపిణీ, ఆరోగ్యకరమైన భోజనాలు, వికలాంగుల కోసం ప్రత్యేక అవసరాలు, అవసరమైన సామగ్రి పంపిణీ.
ఆహారంతో పాటు పుస్తకాలు, వికలాంగుల కోసం జీవనోపాధి, విద్యా మద్దతు, యువత కోసం క్రీడా ప్రోత్సాహం, అవార్డులు, క్రీడా కిట్లు పంపిణీ, వాలీబాల్, కేరమ్ బోర్డులు పంపిణీ, వినోదం కోసం ఆట పరికరాలు ఉచిత మందుల పంపిణీ, అవసరమైన వారికి ఆరోగ్య సహాయం, దుప్పట్లు పంపిణీ హైజీన్, సౌకర్యం కోసం,
దృష్టి పరీక్షల శిబిరాలు, ఉచిత కంటి పరీక్షలు, కన్సల్టేషన్, పేద విద్యార్థులకు ఫీజు సహాయం, విద్యను కొనసాగించేందుకు మద్దతు
కాలెండర్ విడుదల, పంపిణీ, సంఘీకతకు మార్గదర్శకంగా
మహిళా దినోత్సవ వేడుకలు, ప్రేరణాత్మక మహిళలకు గౌరవం, గ్రేస్ అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం, ప్రేమను ఆహార రూపంలో పంచడం జిహెచ్ఎంసి కార్మికులకు ఫుడ్ డ్రైవ్, ఫ్రంట్లైన్ వర్కర్లకు కృతజ్ఞత. సమ్మర్ కూలింగ్ స్టేషన్లు (అన్యూల్ ఇనిషియేటివ్), ప్రతీ వేసవిలో విశ్రాంతి కేంద్రాలు. అనుబంధ గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు, వెనుకబడిన ప్రాంతాలకు వైద్య సేవలు.
యలమంచి ఉదయ్ కిరణ్ ఛారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ప్రజల హృదయాలను తాకుతూ, మియాపూర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మద్దతును పొందుతున్నాయి. అటు రాజకీయ రంగంలో కూడా అందరూ మన్ననలు పొందుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇంతక ముందు, వీరి సేవలను గుర్తించి బెస్ట్ అచీవ్మెంట్స్ అవార్డును ప్రెస్ వింగ్స్ క్లబ్ నుండి అందుకున్నారు. గౌరవాలు ఆయనకు మరింత బాధ్యతను,సేవా సంకల్పాన్ని ఇచ్చాయని ఆయన అన్నారు.