పెద్దపల్లి వద్ద క్లస్టర్ విరిగిపోవడంతో రైళ్లకు అంతరాయం
లోకల్ గైడ్: పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని కునారం ఆర్వోబీ వద్ద క్లస్టర్ విరగడ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించింది. కాజీపేట మార్గంలో నడిచే అన్ని రైళ్లు నిలిచిపోయాయి. ఈ కారణంగా బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.తెల్లవారుజామున సికింద్రాబాద్కు వెళ్లే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలును రాఘవాపురంలో ఆపేశారు. బెల్లంపల్లిలో ఎక్కిన ప్రయాణికులు రైలు గంటలకొద్దీ నిలిచిపోవడాన్ని మొదట సిగ్నల్ సమస్యగా భావించారు. కానీ క్లస్టర్ విరిగిపోయిందని, రైళ్లు వెళ్లలేవని తెలిసి బస్సులు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది.కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల నుంచి టెట్ పరీక్షకు వెళ్తున్న అభ్యర్థులు పెద్దగా ఆందోళనకు గురయ్యారు. చివరికి వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు.ఈ కారణంగా మిగతా అన్ని రైళ్లు ఒక రోజు రద్దు చేయబడ్డాయి. దీంతో బెల్లంపల్లి రైల్వే స్టేషన్కి వచ్చిన కొంతమంది ప్రయాణికులు వెనుదిరిగి వెళ్లిపోగా, మరికొంతమంది ప్రైవేట్ వాహనాల్లో బయలుదేరారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే కొందరు స్టేషన్లోనే రైళ్లు తిరిగి నడవాలని ఎదురుచూశారు.