ప్రతి మండలంలో 500 ఇండ్లలో పీఎం సూర్య ఘర్ యోజన అమలు లక్ష్యం....

ప్రతి మండలంలో 500 ఇండ్లలో పీఎం సూర్య ఘర్ యోజన అమలు లక్ష్యం....

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

*పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన  పథకం పై విస్తృత ప్రచారం కల్పించాలి

*పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన  పథకం అమలు పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, లోకల్ గైడ్:  

ప్రతి మండలంలో 500 ఇండ్లలో పీఎం సూర్య ఘర్ యోజన అమలు లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పీఎం సూర్య ఘర్ యోజన పథకం అమలు  సంబంధిత అధికారులతో  మండలాల వారీగా సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,  మన ఇండ్ల పై సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం  40 శాతం సబ్సిడీ అందిస్తుందని అన్నారు.   300 యూనిట్ల విద్యుత్తు వాడే వారు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం 60 నుంచి 78 వేల వరకు సబ్సిడీ అందిస్తుందని అన్నారు. 2 కిలో వాట్ల వరకు కిలో వాట్ కు 30 వేల రూపాయల చొప్పున సబ్సిడీ ఉంటుందని, తర్వాత అదనపు కిలో వాట కు 18 వేల రూపాయల సబ్సిడీ అందిస్తుందని, వీటిని మనం సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్న రెండు వారాలలో ప్రభుత్వం విడుదల చేస్తుందని అన్నారు. మన ఇంటి పైన ఏర్పాటు చేసుకున్న సోలార్ విద్యుత్ ప్యానెల్  ఉత్పత్తి చేసిన విద్యుత్  మన అవసరాలకు వాడుకుని మిగిలిన విద్యుత్ ను గ్రిడ్ కు అమ్మడం జరుగుతుందని అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ద్వారా ప్రతి నెలా వచ్చే 4 లక్షల బిల్లు ప్రస్తుతం రావడం లేదని, నెలకు 30 నుంచి 40 వేల ఆదాయం కలెక్టరేట్ కు వస్తుందని అన్నారు. ప్రతి మండలంలో 500 ఇండ్లు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం క్రింద సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేలా మండల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.  ప్రజలకు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన  పథకం పై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి ఎం. కాళిందిని, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Tags:

About The Author

Latest News