కేంద్ర హోంశాఖ మాత్యుల పర్యటన

కేంద్ర హోంశాఖ మాత్యుల పర్యటన

కేంద్ర బలగాల సమన్వయంతో ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్నైపర్ టీమ్స్,లతో భారీ బందోబస్తు ఏర్పాటు...

 పటిష్టమైన నిఘా వ్యవస్థ, బైనాక్యూలర్ తో అణుక్షణం పర్యవేక్షణ : పోలీస్ కమిషనర్ వెల్లడి..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) 
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఈ నెల 29 వ తేదీన కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్ షా పర్యటన సందర్బంగా పూర్తి స్థాయిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య తెలిపారు...
ఈ సందర్బంగా కేంద్ర బలగాలతో సమన్వయం చేసుకుంటు రాష్ట్రంలోని ప్రత్యేక నిఘా బృందాలతో  2 ఆక్టోపస్ టీమ్ లు, గ్రేహౌండ్స్ టీమ్లు, స్నైపర్ టీమ్స్ లతో పాటు, నిజామాబాద్ జిల్లాలోని స్పెషల్ పార్టీలు టీమ్స్, బి.డి టీమ్స్, డాగ్ స్వ్కాడ్స్ లతో బస్టాండ్స్, రైల్వే స్టేషన్ లు, కల్వర్టులు, రోడ్లు మొదలగు ప్రదేశాలలో చెక్ చేసి ఏరియా డామినేషన్ చేయడం జరిగిందన్నారు. గత వారం రోజుల నుండి అన్ని హోటల్స్, రెస్టారెంటులు, రిసార్ట్స్లను తనిఖీలు నిర్వహించి, ముఖ్యఅతిది పర్యటించే ప్రాంతాల్లోని అన్ని చోట్ల ఇండ్లను తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. అన్ని శాఖలతో సమన్వయం చేస్తు 10 కి.మీ వరకు పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోనికి తీసుకోవడం జరుగుతుందన్నారు. అన్ని రకాల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. చుట్టు ప్రక్కల ప్రతీ ఇంట్లో ఎవ్వరిని కొత్తవారిని రానివ్వవద్దని తెలియజేసినట్టు చెప్పారు. అనుమానస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనపడితే  వెంటనే డయల్ 100 లేదా మీ స్థానిక పోలీసులకు సమాచారం అందించగలరు.ఈ నేపధ్యంలో అదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, మెదక్ ,సిద్దిపేట్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుండి పోలీస్ సిబ్బంది మరియు టి.ఎస్.ఎస్.పి బెటాలియన్ పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహణ కోసం దాదాపు 1300 మందితో ఏర్పాట్లు చేయడం జరిగింది.ఈ పర్యటన సందర్భంగా మొదటి నుండి చివరి వరకు దారి పోడువున " *సి.సి కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాట్లు, బైనాక్యూలర్లతో పర్యవేక్షణ, పాత నేరస్తులపై నిఘా పటిష్ట పర్చడం జరిగింది. కావున ప్రజలందరూ ట్రాఫిక్ సిబ్బందికి మరియు బందోబస్తులో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి సహకరించగలరని తెలిపారు..

Tags:

About The Author

Related Posts

Latest News