ఘనంగా భారతదేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలు
--------వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి రెడ్డి ఆదేశానుసారం
వనపర్తి లోకల్ గైడ్,
భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
వనపర్తి పట్టణంలోని నేడు భారతదేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా శనివారం రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పివి నర్సింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ ఉమ్మడి గోపాల్ పేట్ ఇంచార్జ్ సత్యశీల రెడ్డి ఓబీసీ జిల్లా అధ్యక్షులు కోట్ల రవి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ కాంగ్రెస్ పార్టీ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ మాట్లాడుతూ
శ్రీ పి.వి. నరసింహారావు1921 జూన్ 28న కరీంనగర్లో జన్మించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలోను, బోంబే యూనివర్శిటీలోను, నాగ్పూర్ యూనివర్శిటీలోను చదువుకున్నారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలు దివాలా స్థాయికి చేరుకుని ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది ఆ సమయంలో పీవీ తన శక్తి యుక్తులు, రాజకీయ చతురతతో సరళీకృత ఆర్థిక విధానం ప్రవేశపెట్టి ఆర్థిక వ్యవస్థను గాడిన పడేసి పునరుజ్జీవం కల్పించారు. దీంతో పీవీకి ఆర్థిక సంస్కరణల పితామహుడుగా పేరు వచ్చింది. పంజాబ్ తీవ్రవాదాన్ని అణచివేసిన ఘనత పివికే దక్కుతుంది.
దేశంలో అనుపరీక్షలు మొదలుపెట్టింది పీవీ సర్కారే
పీవీ పై గౌరవంతో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకంగా కేంద్ర మానవ వనరుల శాఖను ఆయన కోసమే ఏర్పాటు చేశారు. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను పీవీ ప్రజల కోసం వినియోగించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ పరశురాం నక్క రాములు యాదయ్య ఎల్ఐసి కృష్ణ జీజే శ్రీనివాసులు చుక్క రాజు టిపిసిసి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ ఆర్టిఏ మెంబర్ మహమ్మద్ జాంగిర్ ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ వనపర్తి మండల నాయకులు రఘుపతిరావు మైనార్టీ నాయకులు మహమ్మద్ వసీం అస్లం ఇర్ఫాన్ మహమ్మద్ పాషా షేక్ బషీర్ జమీల్ ఎండి ఆరిఫ్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఈశ్వర్ గౌడ్ కార్తీక్ నారాయణ వాకిటి నారాయణ నందిమల్ల కిషోర్ గోపి సాగర్ భాస్కర్ నరేష్ సాగర్ క్యాంప్ ఆఫీస్ సిబ్బంది ప్రసాద్ అంబటి రమేష్ ఖాదర్ నరేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.