జూలై 9న జరగనున్న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని
పిలుపునిచ్చినవిజిటేబుల్ ఆటో & మోటార్ వర్కర్స్యూనియన్ కార్యదర్శి ఎం శివకుమార్...
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్)
సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26న సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పును అమలు చేయాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని2025 జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని విజిటేబుల్. ఆటో& మోటర్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎం శివకుమార్ పిలుపునిచ్చారు..నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి లో గల ఎన్ ఆర్ భవన్ 28న పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి...2019 మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం సవరణ చేయాలి.. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు మహిళలకు ఎన్నికల సమయంలో ఉచిత బస్సును ఇవ్వడం జరిగిందన్నారు.. కాబట్టి అప్పుడు ఎన్నికల్లో ఆటో కార్మికుల్ని ఆదుకుంటామని చెప్పడం జరిగింది.. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడీ ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వేజిటేబుల్.ఆటో &మోటర్ వర్కర్స్ సభ్యులు ఇమ్రాన్ సురేష్ బాబా ప్రసాద్ హైమద్ రంజిత్ అక్లాక్ తదితరులు పాల్గొన్నారు.