జూలై 1 వ తేదీ నుంచి పాఠశాల విద్యార్థులకు కోడిగుడ్డు పెట్టలేము...
AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య....
నిజామాబాద్: (లోకల్ గైడ్)
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కి ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వై .ఓమయ్య ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి , టి. చక్రపాణి మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి లు కలిసి వినతి పత్రం అందజేశారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం అకాడమిక్ ఇయర్ కు సంబంధించి మధ్యాహ్న భోజన కార్మికులకు రావలసిన ఐదు కోట్ల రూపాయల బకాయిలను చెల్లించలేదన్నారు..ఈ విషయమై గత ఆకాడమీ క్లియర్ లో ఎన్నిసార్లు ఆందోళన పోరాట కార్యక్రమాలు చేసిన కార్మికులకు సంబంధించిన బిల్లులు చేసి వాటికి సంబంధించిన టోకెన్ నెంబర్లు వచ్చిన తర్వాత కూడా కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని అన్నారు. ప్రస్తుతం అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన తర్వాత పాఠశాల హెడ్మాస్టర్ ల ద్వారా మధ్యాహ్న భోజన కార్మికులపై ఒత్తిడి చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనము పెట్టడంలో భాగంగా రోజుకు రెండు కూరలు, పప్పు చారు వారానికి మూడు కోడి గుడ్లు పెట్టాలని ఒత్తిడి చేయడం జరుగుతుందన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు చెల్లిస్తున్న మెనూ చార్జీలు ఏమాత్రం సరిపోవని , పెరిగిన ధరలకు అనుగుణంగా ఒక విద్యార్థికి కనీసం 25 రూపాయలు ఛార్జ్ చెల్లిస్తే తప్ప భోజనం పెట్టలేని పరిస్థితి ఉందన్నారు. కోడిగుడ్డు కు ఆరు రూపాయలు ఇస్తున్నారని బహిరంగ మార్కెట్లో ఒక కోడిగుడ్డు ధర 7 నుంచి 8 రూపాయలు ఉందన్నారు వాటితో పాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని నింపుతున్న ఈ పరిస్థితుల్లో గత బిల్లులు రాక అప్పుల ఊబిలో పూరుకపోయిన మధ్యాహ్న భోజన కార్మికులకు మళ్లీ మెనూ ప్రకారం భోజనం పెట్టాలంటే ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు..ప్రభుత్వం జిల్లాకు రావలసిన ఐదు కోట్ల రూపాయల బకాయి బిల్లును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనియెడల జులై ఒకటో తేదీ నుంచి కోడిగుడ్డు పెట్టమని రెండు కూరల్లో ఒకటి మాత్రమే పెడతామని జులై 5వ తేదీ వరకు బిల్లులు రాని ఎడల తొమ్మిదవ తేదీన సమ్మె చేస్తామని డీఈఓ కి తెలియజేయడం జరిగిందన్నారు.