అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశాలు,

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశాలు,

కొండారెడ్డిపల్లి పాఠశాల మోడల్ స్కూల్‌గా అభివృద్ధి,
నిర్దేశించిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి కావాలి,
అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలి,
మంజూరైన పనులను వేగవంతం చేయాలి,
విద్యుత్ లైన్ల భూగర్భీకరణకు కలెక్టర్ ఆదేశాలు,
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూర్ మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎనుముల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ,   సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులుకు ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశాలు,అచ్చంపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులును ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధికి మంజూరైన నిధులను సక్రమంగా వినియోగించుకుంటూ, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వారు సూచించారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవ సహాయం ను నియమించినట్లు కలెక్టర్ వెల్లడించారు.అనంతరం జిల్లా కలెక్టర్  సమీక్ష సమావేశంలో శాఖల వారీగా సమీక్ష చేపడుతూ ......  కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు తమ శాఖలకు నిర్దేశించిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలన్నారు.  మంజూరు అయిన పనులను వేగవంతం చేసి పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.రోడ్ల విస్తరణ, రోడ్ల బలోపేతంకు సంబంధించి పంచాయతి రాజ్, ఆర్ అండ్ బి శాఖల ఇంజనీర్లు  ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు జిల్లాకలెక్టర్ సూచించారు. ఎస్సీ కమ్యూనిటీ భావన నిర్మాణానికి స్థల సేకరణ తోపాటు అందుకే కావలసిన ప్రభుత్వ అనుమతుల ప్రతిపాదనలను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కొండారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు 100% నమోదు జరిగేలా కృషి చేయాలని, కొండారెడ్డిపల్లి పాఠశాలను మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, పాఠశాల ఆవరణలోనే అదనంగా ఒక అంగన్వాడి భవనాన్ని నిర్మించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో లైబ్రరీ, బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ సేవలకు కావలసిన భవనాల ఏర్పాట్లు తదితర అంశాలపై శాఖల వారీగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ప్రతి పనినీ నిర్దేశించిన సమయానికే పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఏ అవసరమైన తనను ఎల్లవేళలా సంప్రదించవచ్చని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాట్లకు కావలసిన ప్రతిపాదనలను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న రహదారి విస్తరణ పనులకు వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పాల శీతలీకరణ కేంద్ర భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, వాటిని ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. విద్యుత్ లైన్లను భూమి లోపల నుండి ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామంలో విద్యుత్తు లైట్లుకు సోలార్ విద్యుత్ అందించాలని,వీధి లైట్ల ఏర్పాటుకు అవసరమైన కరెంటు స్తంభాలను సిద్ధం చేయాలని, కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ కార్యక్రమం కింద మంచి నీటి సరఫరాకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. త్రాగునీటి సరఫరా కోసం నూతనంగా వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని చేపట్టాలని కలెక్టర్ కోరారు. అలాగే, కొండారెడ్డిపల్లి గ్రామాన్ని వంద శాతం సోలార్ విద్యుత్ గ్రామంగా అభివృద్ధి చేయాలని రెడ్కో అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి స్వగ్రామం లో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా పనులను నాణ్యతతో పూర్తి చేయాలని, అభివృద్ధి పనులకు కావలసిన నిధులు ఇప్పటికే మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అదనంగా చేపట్టిన పనులకు కావాల్సిన అనుమతులకు అవసరమైన మంజూరు ప్రక్రియను వేగవంతంగా చేపట్టేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గానికి గుర్తింపు వచ్చేలా కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు.

Tags:

About The Author

Latest News