పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ బృందం మెరుపు దాడి

పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ బృందం మెరుపు దాడి

పోలీస్ కమీషనర్ వెల్లడి...

నిజామాబాద్ (లోకల్ గైడ్) 
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య  ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి సార్ ఆధ్వర్యంలో  టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు ఎస్సై గోవింద్ మరియు సిబ్బంది, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్  పరిధిలోని గొల్ల గుట్ట గ్రామ అటవీ ప్రాంతంలో పేకాట   స్థావరంపై దాడి చేశారు.. 6మంది పేకాట రాయుళ్ళు మరియు 7 సెల్ ఫోన్స్, నగదు 102000 రూపాయలు స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం నిజామాబాదు రూరల్ పోలీసులకు అప్పగించారు..

Tags:

About The Author

Latest News