ఓ యువకుడిపై ఓ వర్గానికి చెందిన పదులసంఖ్యలో మూకుమ్మడి దాడి...
కేవలం ఆరుగురుపై కేసు నమోదు...
తప్పుబట్టి రాస్తారోకోకు దిగిన గ్రామస్తులు...
మిగిలిన వారిపై దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేస్తామని హామీతో ఆందోళన విరమణ...
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో ముదిరాజ్ యువకుడి పై ఓ వర్గం యువకులు 40 మంది అమానుష దాడి చేసిన ఘటనలో పోలీసులు కేవలం ఆరుగురిపై కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ మిగతా నిందితులను అరెస్టు చేయాలని బాధితుడికి మద్దతుగా మోర్తాడ్ గ్రామం కొన్ని కుల సంఘాల సభ్యులు మోర్తాడ్ 63 జాతీయ రహదారిపై ధర్నా రాస్తా రోకో నిర్వహించారు.పోలీసులకు కుల సంఘాల సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.రొయ్యల సురేశ్ పై డాడీ చేసిన మిగతా 34 మందిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సి ఐ పొన్నం సత్యనారాయణ జోక్యం చేసుకుని విచారణ చేపట్టి 24 గంటల్లో న్యాయం చేస్తానని మాట ఇవ్వడంతో కుల సంఘాల సభ్యులు రాస్తారోకో విరమించారు. దీంతో కొద్దిసేపు వాహనదారులకు ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడింది.