మరోసారి ఏఐజీ ఆసుపత్రికి మాజీ సీఎం కేసీఆర్
By Ram Reddy
On
హైదరాబాద్: మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ శనివారం మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారు. వైద్య పరీక్షల కోసం ఆయన ఆసుపత్రికి వెళ్లారు. ఇదిలా ఉంటే, సాధారణ ఆరోగ్య తనిఖీల కోసం కేసీఆర్ శుక్రవారం కూడా ఏఐజీకి వెళ్లిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆసుపత్రి చేరుకున్న ఆయన సుమారు ఒక గంట పాటు అక్కడే ఉన్నారు. ఏఐజీ చైర్మన్, ప్రసిద్ధ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్కు పలు పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య పరంగా ఎటువంటి సమస్యలు లేనప్పటికీ, అవసరమైన జాగ్రత్తలపై వైద్యులు కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం.
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...