రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థిని మృతి...

రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థిని మృతి...

శోక సంద్రంలో కుటుంబ సభ్యులు...

  నిజామాబాద్ (లోకల్ గైడ్) ఉన్నత చదువుల కొరకు నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలకు ఎంతో సంతోషంగా వెళుతున్న ఓ విద్యార్థిని మండల కేంద్రంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయింది. స్థానికుల సమాచారం మేరకు 10వ తరగతి పూర్తి చేసుకున్న పదహారేళ్ల తేజస్విని  సోమవారం నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ కు తండ్రితో కలిసి వెళుతుండగా నవీపేట్ మండల కేంద్రంలో బాసర రహదారి పై జరిగిన ప్రమాదంలో నిజామాబాద్ వైపు వెళుతున్న లారీ బాలిక తలపై నుండి వెళ్లడంతో తల ఛిద్రమై ఘటన స్థలంలోనే మృతి చెందింది. అప్పటివరకు సంతోషంగా ఉన్న వారు ఈ ఘటనతో స్థానికులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Tags:

About The Author

Latest News