రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థిని మృతి...
By Ram Reddy
On
శోక సంద్రంలో కుటుంబ సభ్యులు...
నిజామాబాద్ (లోకల్ గైడ్) ఉన్నత చదువుల కొరకు నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలకు ఎంతో సంతోషంగా వెళుతున్న ఓ విద్యార్థిని మండల కేంద్రంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయింది. స్థానికుల సమాచారం మేరకు 10వ తరగతి పూర్తి చేసుకున్న పదహారేళ్ల తేజస్విని సోమవారం నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ కు తండ్రితో కలిసి వెళుతుండగా నవీపేట్ మండల కేంద్రంలో బాసర రహదారి పై జరిగిన ప్రమాదంలో నిజామాబాద్ వైపు వెళుతున్న లారీ బాలిక తలపై నుండి వెళ్లడంతో తల ఛిద్రమై ఘటన స్థలంలోనే మృతి చెందింది. అప్పటివరకు సంతోషంగా ఉన్న వారు ఈ ఘటనతో స్థానికులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...