ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాలి

....పెంచిన బస్ పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలి

ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాలి

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ )

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ బస్ డిపో ముందు ధర్నా  మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంధసిరి జ్యోతి బాసు ,పట్ల మధు ప్రభుత్వం పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంధసిరి బాసు, పట్ల మధు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో ముందు   రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆర్టీసీ సంస్థ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.. అనంతరం ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంధసిరి బాసు, పట్ల మధు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బస్ పాస్ ఛార్జీలు పెంచడం సరికాదుగతంలో 1150 rs. ఉంటే ఇప్పుడు 1400 వందలకు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. జిల్లాలో  మారు మూల ప్రాంతాలనుండి చదువుకోడానికి విద్యార్థులు మండలాలకు అలాగే జిల్లా కేంద్రానికి వస్తుంటారు అని తెలిపారు. ఇప్పటికే విద్యార్థులు బస్ పాస్ ఛార్జీలు కట్టలేక తల్లితండ్రుల పై ఒత్తిడి తెస్తునారుఅయిన ఈ ప్రభుత్వం RTC బస్ పాస్ చార్జీలను 20% పెంచడం సరికాదు విమర్శించారు .అలాగే విద్యార్థుల పై ఒత్తిడి తీసుకురావడమే కాక  విద్యార్థుల తల్లిదండ్రులు చెమట చెందించి  పూట  గడవక ఇబ్బంది పడుతూ విద్యార్థుల భవిష్యత్తు చదువు ఆ విద్య అందుకోవడానికి విద్యార్థులని విద్యార్థుల తల్లిదండ్రులు చెమటోడ్చి పనిచేస్తూ విద్యార్థులను చదువుల కోసం మండలాలలకి జిల్లా కేంద్రంలోకి పంపడం జరుగుతుంది  ఇట్లాంటి పరిస్థితులలో  . రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదు అన్నారు.  ప్రభుత్వం వెంటనే బస్ పాస్ చార్జీలను తగ్గించాలని SFI తొర్రూరు మండల కమిటీ డిమాండ్ చేస్తుంది లేని యడల పెద్ద ఎత్తున్న జిల్లాలో బస్లు నడవకుండా ఉద్యమాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షులు భానోత్ సింహాద్రి ,మహబూబాబాద్ పట్టణ అధ్యక్షులు పవన్ జిల్లా నాయకులు వీరెందర్ వంశీ అరుణ్ మహేష్ వినోద్ తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News