శ్రీరాంగపూర్ - అయోధ్యపూర్ తండా మధ్య రహదారి మరమ్మతులకు శ్రీకారం

శ్రీరాంగపూర్ - అయోధ్యపూర్ తండా మధ్య రహదారి మరమ్మతులకు శ్రీకారం

  ఎమ్మెల్యే శంకరన్న సొంత నిధులతో మట్టి రోడ్డు పనులు

 షాద్ నగర్ లోకల్ గైడ్ 

శ్రీరంగాపూర్ మండలంలోని శ్రీరాంగపూర్ నుంచి అయోధ్యపూర్ తండా వరకు వచ్చే ప్రధాన మార్గంలో మట్టి రోడ్డు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులు స్థానిక ఎమ్మెల్యే శంకరన్న  వారి సొంత నిధులతో ప్రారంభించడం గర్వకారణంగా మారింది.ఈ అభివృద్ధి పనులు గ్రామీణ ప్రజలకు బాగా ఉపయుక్తంగా ఉండనున్నాయి. మట్టిరోడ్డు పనులు చేపట్టడం ద్వారా రాకపోకలు సులభతరం అవుతుండగా, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులకు చెక్ పడనుంది. ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, రైతులు ప్రయాణించడంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గేలా మారుతున్నాయి.పనుల పర్యవేక్షణను మాజీ ఎంపీపీ మంగులాల్ నాయక్  చేపడుతూ, ప్రతి దశలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో శశి నాయక్, తదితర గ్రామ పెద్దలు, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.స్థానికులు ఈ అభివృద్ధికి హర్షం వ్యక్తం చేస్తూ, శంకరన్న గారికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో నాయకులు చొరవ చూపడం అభినందనీయమని పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News