చోరీలపై పోలీస్ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టాలి  

చోరీలపై పోలీస్ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టాలి  

- ఫిర్యాదు దారుల పట్ల పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి 
 -- వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్  (లోకల్ గైడ్ ) : వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని వెస్ట్ జోన్ పరిధిలో గాల వర్దన్నపేట పోలీస్ స్టేషన్ ను బుధవారం రోజున  వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌ సింగ్‌ ఆకస్మికంగా  తనిఖీ చేశారు.ఈ సందర్బంగా  స్టేషన్ పరిసరాలను పరిశీలించి, స్టేషన్ ఆవరణంలో మొక్కను నాటారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ పోలీస్ స్టేషన్లోని పైల్లా ను పరిశీలిస్తూ   ప్రధానంగా పెండింగ్ చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్, సోమ్ము రికవరీ, పెండింగ్ లో వున్న చోరీ కేసులు, నిందితుల అరెస్ట్ పై వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు సుధీర్ఘ కాలంగా పెండింగ్‌లో వున్న ఇతర కేసులపై వివరాలు పరిశీలించి, పెండింగ్‌కు గల కారణాలను  సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులను అడిగి తెలుసుకోని, కేసుల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలను పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ  పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నేరాల నియంత్రణకై సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలను భాగస్వాములను చేయడంతో పాటు సిసి కెమెరాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగహన కల్పించాలని, నేరాలకు సంబంధించి అధికారులు దర్యాప్తు సమయం లో టెక్నాలజీ తో పాటు శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేపట్టాలని తెలిపారు.చోరీలపై పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యంగా వాహనాల చోరీలకు సంబంధించి వాహనాలను ఇంటిలో పార్కింగ్ చేసుకోనే విధంగా ప్రజలకు సూచించాలని సీపీ తెలియజేసారు. వివిధ సమస్యలతో పోలీసు స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల సిబ్బంది  స్నేహపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.నేర నియంత్రణలో ప్రజల సహకారంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా సిపి సిబ్బందికి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  జనగాం డిసిపి రాజమహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసిపి నరసయ్య, వర్దన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు, ఎస్సైలు చందర్, రాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News